భూత్పూర్, జూన్ 19 : కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన సర్పై బీఆర్ఎస్ కార్యకర్తలు అప్రమత్తంగా ఉండి అర్హుల ఓట్లు తొలగిపోకుండా చూడాలని, బీఆర్ఎస్ సభ్వత్వాన్ని వెంటనే పూర్తి చేయాలని దేవరకద్ర మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డి పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. శుక్రవారం మహబూబ్నగర్ జిల్లా భూత్పూర్ మండలం అన్నాసాగర్లోని మాజీ ఎమ్మెల్యే ఆల నివాసంలో పార్టీ శ్రేణులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆల మాట్లాడుతూ గ్రామాలు, వార్డులు, పట్టణాల్లో 30 శాతానికి పైగా బీఆర్ఎస్ సభ్యత్వ సమోదు చేయాలని సూచించారు. కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన హామీలను తు ంగలో తొక్కిన విషయాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకుపోవాలన్నారు. సర్ పేరుతో కేంద్ర ప్రభుత్వం ఓట్లను తొ లగించేందుకు కుట్ర చేస్తున్నట్టు ఆరోపించారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల అధ్యక్ష, కార్యదర్శులు సత్తూర్ బస్వరాజ్గౌడ్, శ్రీనివాస్రెడ్డి, సర్పంచ్ ఆల శ్రీకాంత్రెడ్డి పాల్గొన్నారు.
అత్యంత పారదర్శకంగా ‘సర్’ ప్రక్రియ ; అధికారులను ఆదేశించిన రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి
హైదరాబాద్, జూన్ 19 (నమస్తే తెలంగాణ): కేంద్ర ఎన్నికల సంఘం ఈ నెల 25 నుంచి చేపట్టనున్న స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(సర్) ప్రక్రియను అత్యంత పారదర్శకంగా నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి బీ సుదర్శన్రెడ్డి అధికారులను ఆదేశించారు. ‘సర్’ సన్నాహకాల్లో భాగంగా శుక్రవారం రాష్ట్ర ఎన్నికల సంఘం అదనపు ప్రధానాధికారి డాక్టర్ వాసం వెంకటేశ్వరరెడ్డితో కలిసి ఆయన వీడియోకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా సుదర్శన్రెడ్డి మాట్లాడుతూ ‘సర్’ ప్రక్రియను క్షేత్రస్థాయిలో పకడ్బందీగా నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల కమిషన్ జారీచేసిన మార్గదర్శకాలను అధికారులు కచ్చితంగా పాటించాలని చెప్పారు.