హైదరాబాద్, మార్చి 23 (నమస్తే తెలంగాణ): మహారాష్ట్రలోని కంధార్లోహలో 26న నిర్వహించే సీఎం కేసీఆర్ సభకు పెద్దసంఖ్యలో తరలిరావాలని బీఆర్ఎస్ మహారాష్ట్ర కిసాన్ సమితి రాష్ట్ర అధ్యక్షుడు మాణిక్రావు కదం పిలుపునిచ్చారు.
గురువారం లోహాలోని అతిథి హోటల్లో మాట్లాడుతూ, పర్భణి జిల్లాలోని పలు తాలూకాల్లో సన్నాహాక సమావేశాలు నిర్వహించామని చెప్పారు. బీఆర్ఎస్ నేతలు సుధాకర్ పోలా, బాలాసాహెబ్ , రంగనాథ్, షేక్ జాఫర్, అమృతరావు, బషీర్ అహ్మద్ పాల్గొన్నారు.