BRS | కాంగ్రెస్లో చేరిన ఎమ్మెల్సీలు పట్నం మహేందర్ రెడ్డి, కూచుకుళ్ల దామోదర్ రెడ్డిపై బీఆర్ఎస్ అనర్హత పిటిషన్ దాఖలు చేసింది. ఈ మేరకు పార్టీ ఫిరాయించిన ఇద్దరు ఎమ్మెల్సీలపై అనర్హత వేటు వేయాలని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డికి ఫిర్యాదు చేసింది.
బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు శేరి సుభాష్ రెడ్డి, ఎమ్మెస్ ప్రభాకర్, యాదవరెడ్డి శుక్రవారం మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఇంటికి వెళ్లి ఫిర్యాదు చేశారు. స్థానిక సంస్థల కోటాలో బీఆర్ఎస్ పార్టీపై గెలిచిన పట్నం మహేందర్ రెడ్డి, కూచుకుళ్ల దామోదర్ రెడ్డిలు కాంగ్రెస్లో చేరారని, ఇది ప్రజాప్రతినిధ్య చట్టానికి విరుద్దమని, వారిపై అనర్హత వేటు వేయాలని వినతి పత్రంలో పేర్కొన్నారు. ఇందుకు సంబంధించిన ఆధారాలను చైర్మన్కు సమర్పించారు. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్సీలపై వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు.