ఇల్లంతకుంట/రాజన్న సిరిసిల్ల, జనవరి 17 (నమస్తే తెలంగాణ): ‘కాంగ్రెస్ సర్కారును కూల్చే ఉద్దే శం బీఆర్ఎస్కు లేదు. కానీ.. కరీంనగర్ ఎంపీ బం డి సంజయ్ మా పార్టీని అడ్డంపెట్టుకొని దిగజారుడు రాజకీయం చేస్తున్నడు. ఆయన నోటి దురు సు మానుకోవాలి’ అని మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్కుమార్ చెప్పారు. అబద్ధపు హామీలిచ్చే కాం గ్రెస్ అధికారంలోకి వచ్చిందని విమర్శించారు. 100 రోజుల్లో ఆరు గ్యారెంటీలను అమలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. లేదంటే బలమైన ప్రతిపక్షంగా ప్రజల పక్షాన పోరాడుతామని స్పష్టం చేశారు.
బుధవారం రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంటలో మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్తో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వం సాగుకు 24 గంటల కరెంట్ ఇవ్వడంలో విఫలమైందని, కాళేశ్వరం నీటిని ఇవ్వబోమని చేతులెత్తేసిందని ధ్వజమెత్తారు. రైతుభరోసా కింద ఎకరాకు రూ.15 వేలు ఇస్తామని తప్పించుకున్నదని మండిపడ్డారు.
అధికారంలోకి రాగానే 200 యూనిట్ల ఫ్రీ కరెం ట్ ఇస్తామని, మహిళలకు నెలకు రూ.2500 ఇస్తామని ఇప్పుడు నిధుల్లేవని చెప్తున్నదని విమర్శించారు. ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వ తీరును గమనిస్తున్నారని, బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారని హెచ్చరించారు. అనంతరం రాజన్నసిరిసిల్ల జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మాట్లాడుతూ.. బతుకమ్మ చీరల బకాయిలు రూ.250 కోట్లు వెం టనే విడుదల చేయాలని వినోద్కుమార్ డిమాండ్ చేశారు.
కేసీఆర్ ప్రభుత్వం నేతన్నల సంక్షేమం కోసం ప్రవేశపెట్టిన సంక్షేమ, అభివృద్ధి పథకాలను యథావిధిగా కొనసాగించాలని కోరారు. రాష్ట్ర వ్యా ప్తంగా ఉన్న చేనేత, మరమగ్గాల కార్మికులకు రుణమాఫీ చేసిన ఏకైక ప్రభుత్వం కేసీఆర్దేనని గుర్తుచేశారు. లెక్క పక్కాగా ఉండేలా ప్రతీ మరమగ్గానికి జియోట్యాగింగ్ చేసి, ప్రతి కార్మికుడికి రైతు మాదిరిగా రూ. 5 లక్షల బీమా సౌకర్యం కల్పించినట్టు తెలిపారు.
నేతన్నల ఆరోగ్య పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని 50 ఏండ్లకే ఆసరా పింఛను ఇచ్చినట్టు చెప్పా రు. వర్కర్ టు ఓనర్ పథకాన్ని వెంటనే అమలు చేయాలని సూచించారు. ఈ సమావేశంలో జడ్పీ చైర్పర్సన్ న్యాలకొండ అరుణ, టీఎస్టీపీడీసీ మా జీ చైర్మన్ గూడూరి ప్రవీణ్, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య తదితరులు పాల్గొన్నారు.