ఆర్మూర్, అక్టోబర్ 2: ప్రధాని నరేంద్రమోదీ ఎన్నికల్లో లబ్ధిపొందేందుకు పసుపు బోర్డు ప్రకటన చేశారని బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు, రైతు నాయకుడు కోటపాటి నర్సింహనాయుడు సోమవారం ఒక ప్రకటనలో ఆరోపించారు. మరోసారి రైతులను మోసంచేసేందుకు కుట్రకు తెరలేపారని ఆయన పేర్కొన్నారు. పసుపు బోర్డు ఏర్పాటు చేయాలంటే పార్లమెంట్లో చట్ట సవరణ చేయా ల్సి ఉంటుందని సూచించారు.
1986లో పార్లమెంట్ ద్వారా చట్టమైన స్పైసెస్ బోర్డులో భాగంగా ఉన్న పసుపునకు బోర్డు ఏర్పాటు చేయాలంటే ప్రత్యేక చట్టం చేయాలని ప్రధాని మోదీకి తెలియదా? అని ప్రశ్నించారు. బీజేపీకి చిత్తశుద్ధి ఉంటే ఇటీవల నిర్వహించిన పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో పసుపు బోర్డు కోసం ఎందుకు బిల్లు పెట్టలేదని ప్ర శ్నించారు. స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం రైతులను మభ్య పెట్టవద్దని ఆయన సూచించారు.