హైదరాబాద్, మే 6 (నమస్తే తెలంగాణ): ఢిల్లీ మద్యం విధానం కేసులో జ్యుడీషియల్ కస్టడీలో ఉన్న ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత దాఖలు చేసిన బెయిల్ పిటిషన్లను న్యాయస్థానం తిరస్కరించింది. రౌస్ ఎవెన్యూ కోర్టులో సోమవారం జరిగిన విచారణ సందర్భంగా కవిత తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. లోక్సభ ఎన్నికలున్నాయని, పార్టీ తరఫున స్టార్ క్యాంపెయినర్గా ఉన్నారని, దీంతోపాటు పీఎంఎల్ఏ సెక్షన్ 45 ప్రకారం కవిత బెయిల్కు అర్హురాలని చెప్పారు. ఎలాంటి ఆధారాలు లేకుండానే అరెస్టు చేశారని, ఈడీ కస్టడీలో ఉన్నపుడే సీబీఐ ఎందుకు అరెస్టు చేసిందని ప్రశ్నించారు. ఏడేండ్లలోపు శిక్షపడే కేసుల్లో అరెస్టు అవసరం లేదన్నారు. కవితకు బెయిల్ ఇవ్వవద్దని, బెయిల్ ఇస్తే సాక్ష్యాలను తారుమారు చేస్తారని ఈడీ, సీబీఐ తరఫు న్యాయవాదులు చెప్పారు. దీంతో కోర్టు బెయిల్ పిటిషన్లు తిరస్కరించారు.
తనను వీడియో కాన్ఫరెన్స్ పద్ధతిలో కాకుండా నేరుగా న్యాయస్థానంలోనే విచారించాలని కవిత వేసిన పిటిషన్ను కోర్టు అనుమతించింది. మంగళవారంతో కవిత జ్యుడీషియల్ కస్టడీ ముగియనున్నది. ఈ నేపథ్యంలో ఆమెను మధ్యాహ్నంకోర్టు ముందు ప్రత్యక్షంగా హాజరుపర్చనున్నారు.