నల్లగొండ, ఏప్రిల్ 17: నల్లగొండ జిల్లా కేంద్రంలో బుధవారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో బీఆర్ఎస్ నేత దుర్మరణం చెందారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సినీ హాస్య నటుడు రఘుబాబు బుధవారం సాయంత్రం బీఎండబ్ల్యూ కారులో హైదరాబాద్ నుంచి నెల్లూరు వైపు వెళ్తున్నారు. నల్లగొండ జిల్లా కేంద్రం శివారుకు రాగానే అద్దంకి-నార్కట్పల్లి హైవేపై దుప్పలపల్లి రోడ్డులో ఉన్న దత్తసాయి వెంచర్కు బైక్పై వెళ్తున్న బీఆర్ఎస్ నల్లగొండ పట్టణ ప్రధాన కార్యదర్శి సందినేని జనార్దన్రావు(49)ను కారు ఢీకొట్టింది. దాంతో జనార్దన్రావు అక్కడికక్కడే మృతి చెందారు. ఆయనకు భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. జనార్దన్రావు మృతికి మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్రెడ్డి, బీఆర్ఎస్ పార్లమెంట్ అభ్యర్థి కంచర్ల కృష్ణారెడ్డి సంతాపం తెలిపారు.