అందోల్ : కాంగ్రెస్ పార్టీపై ప్రజల్లో నమ్మకం లేకే బీఆర్ఎస్(BRS) పార్టీలో చేరుతున్నారని ఎమ్మెల్యే క్రాంతి కిరణ్(Mla Kranthi Kiran) అన్నారు. అందోల్ క్యాంపు కార్యాలయంలో గురువారం మునిపల్లి మండలంలోని పెద్దలోడి గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ ఉప సర్పంచ్ జగదీష్, పార్టీ గ్రామ అధ్యక్షుడు మల్లేశం, మాజీ ఎంపీటీసీ సుందర్ ఆధ్వర్యంలో 200 మంది కాంగ్రెస్ కార్యకర్తలు(Congress Members) ఎమ్మెల్యే సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రజల కష్టసుఖాలు తెలుసుకుని ఆపదలో ఆదుకుంటున్న బీఆర్ఎస్ పార్టీని ఎదుర్కొనే దమ్ము ప్రతి పక్ష పార్టీలకు లేదన్నారు. ఎన్నికల సమయం దగ్గర పడుతుందని కాంగ్రెస్, బీజేపీ నాయకులు విందులకు, చావులకు హాజరువుతున్నారుని ఆరోపించారు. కరోనా వంటి కష్టకాలంలో సైతం బీఆర్ఎస్ పార్టీ ప్రజలకు అండగా నిలిచిందని గుర్తు చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్(CM KCR) నాయకత్వాన్ని దేశం కోరుకుంటుందని అన్నారు.
మరోసారి బీఆర్ఎస్కు పట్టం కట్టడం ఖాయమని పేర్కొన్నారు. కాంగ్రెస్లో దొరకని హోదా, గౌరవం, మర్యాద బీఆర్ఎస్లో దొరుకుతుందని వివరించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షడు విజయ్ కుమార్, సీనియర్ నాయకుడు సాయికుమార్, ప్రధాన కార్యదర్శి శశికుమార్, సర్పంచ్ పార్వతి అశోక్, ఎంపీటీసీ రేణుక, వెంకటేష్తదితరులు పాల్గొన్నారు.