యాదాద్రి భువనగిరి, జనవరి 13 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలో ఎన్నికలెప్పుడొచ్చినా బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. బీజేపీ వ్యతిరేక పోరులో బీఆర్ఎస్ సఫలమవుతుందని ధీమా వ్యక్తం చేశారు. బీజేపీ వ్యతిరేక శక్తిగా ఉన్న గులాబీ పార్టీతో కలిసి వెళ్లాలని నిర్ణయించుకున్నామని స్పష్టం చేశా రు. యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి పట్టణంలో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. తెలంగాణలో పాగా వేసేందుకు బీజేపీ సర్వశక్తులు ఒడ్డుతున్నదని అన్నారు. అందులో భాగంగానే వివిధ పార్టీల నాయకులను డబ్బుతో ప్రలోభ పెడుతున్నదని, వినకుంటే ఈడీని రంగంలోకి దింపి భయభ్రాంతులకు గురిచేస్తున్నదని విమర్శించారు.