నిర్మల్ : సీఎం కేసీఆర్(CM KCR) నేతృత్వంలో 60 లక్షల సభ్యత్వాలతో బీఆర్ఎస్(BRS) జాతీయ పార్టీగా ప్రజాదరణ పొందుతున్నదని రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి(Minister Indrakaran reddy) అన్నారు. మంగళవారం నిర్మల్ జిల్లా సారంగాపూర్ మండలం స్వర్ణలో జరిగిన బీఆర్ఎస్(Brs) ఆత్మీయ సమ్మేళనానికి మఖ్య అతిథిగా హాజరై పార్టీ శ్రేణులకు దిశా నిర్ధేశం చేశారు.
తెలంగాణ రాష్ట్రంలో ఎవరూ ఊహించని విధంగా సంక్షేమ పథకాలు ప్రజలకు అందుబాటులోకి వచ్చాయన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలనే కాకుండా, ప్రజల అవసరాలను గుర్తించి ఎప్పటికప్పుడు కొత్త పథకాలకు శ్రీకారం చుట్టారన్నారు. రాష్ట్రంలో అమలవుతున్న అనేక సంక్షేమ పథకాల కారణంగా గతంలో ఎన్నడూ లేనంతగా ప్రజల్లో ఆర్థిక భరోసా కనిపిస్తోందన్నారు.
కార్యకర్తలు ఉత్సాహంతో పనిచేసి రాబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్ను భారీ మెజారిటీతో గెలిపించుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. హ్యాట్రిక్(Hat-Trick) విజయానికి సన్నద్ధం కావాలని సూచించారు. నాయకులు, కార్యకర్తలు ప్రతి నిత్యం ప్రజాక్షేత్రంలో ఉంటూ బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకుపోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా ఇన్చార్జి వి . గంగాధర్ గౌడ్, ఎమ్మెల్సీ దండె విఠల్, జడ్పీ చైర్పర్సన్ విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.