వరంగల్ : వరంగల్ తూర్పు నియోజకవర్గానికి చెందిన పలు పార్టీలకు చెందిన నాయకులు బీఆర్ఎస్లో చేరారు. హైదరాబాద్లో మంత్రి కేటీఆర్ సమక్షంలో జనసేన తూర్పు ఇన్చార్జి తాళ్లపెల్లి బాలుగౌడ్, వరంగల్ 42వ డివిజన్ స్వతంత్ర కార్పొరేటర్ గుండు చందన పూర్ణచందర్, ఉద్యమ నాయకుడు అచ్చ విద్యాసాగర్తో పాటు మరికొందరు శనివారం బీఆర్ఎస్లో చేరారు.
ఈ సందర్భంగా వారికి మంత్రి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో శాసనమండలి డిప్యూటీ చైర్మన్, బీఆర్ఎస్ వరంగల్ తూర్పు ఎన్నికల ఇన్చార్జి బండా ప్రకాష్, ఎమ్మెల్యే, తూర్పు నియోజకవర్గం బీఆర్ఎస్ అభ్యర్థి నన్నపునేని నరేందర్, మేయర్ గుండు సుధారాణి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.