హైదరాబాద్, ఏప్రిల్ 27 (నమస్తే తెలంగాణ): బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పార్టీ శ్రేణులకు ఎమ్మెల్సీ కవిత శుభాకాంక్షలు తెలిపారు. గురువారం ఈ మేరకు ట్వీట్ చేశారు.
‘కేసీఆర్ నా యకత్వంలో పిడికెడు మందితో ప్రా రంభమై.. ప్రత్యేక రాష్ట్రం సాధించి.. తొమ్మిదేండ్ల పాలనలో తెలంగాణను దేశంలోనే అగ్రస్థానంలో నిలిపి.. నేడు దేశ ప్రగతి కోసం, రైతు రాజ్యం కోసం వడివడిగా అడుగులు వేస్తున్న బీఆర్ఎస్ శ్రేణులకు, కుటుంబ సభ్యులకు ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు. తెలంగాణ తల్లి విముక్తి కోసం ఆనా డు.. భరతమాత బంగారు భవిత కోసం ఈనాడు.. జై కేసీఆర్.. జై తెలంగాణ… జై భారత్’ అని పేర్కొన్నారు.