Telangana | ప్రభుత్వం గిరిజన మహిళల ఆర్థికాభివృద్ధికి అనేక పథకాలు తీసుకువచ్చింది. వాటి ఆర్థిక సహకారంతో పారిశ్రామిక రంగంలో రాణిస్తున్నారు. స్వయంగా లాభాలు ఆర్జిస్తున్నారు. తమ కాళ్లపై తాము నిలబడుతూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు. కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రం సమీపంలోని చుట్టుపక్కల గ్రామాలకు చెందిన 10 మంది మహిళలు గిరిజన మహిళా సంఘంగా ఏర్పడ్డారు. స్వయంగా ఉపాధిని పొందాలని భావించారు. అధికారులను సంప్రదించి ఐటీడీఏ ఆర్థిక సహకారంతో ‘శ్రీ ఆంజనేయ డ్రైమిక్స్ ఇండస్ట్రీస్’ను స్థాపించారు.
డ్రైమిక్స్ ఇండస్ట్రీస్లో జొన్నలు, మినుములు, వేరుశనగ, జీర, రెడ్చిల్లీ, ఆవాలు, సాల్ట్ పౌడర్, కొర్రలు, పెసర, మిరియాలు, ధనియాలు, సజ్జలు, చక్కర, బాదం, బొంబాయి రవ్వ, యాలకులు, టర్మరిక్.. ఇలా 20 రకాల పదార్థాలతో స్వీట్మిల్, మల్టీగ్రేన్, జవార్మిల్ను తయారు చేస్తున్నారు. గిరి బ్రాండ్ పేరిట ప్యాకింగ్ చేసి అంగన్వాడీ కేంద్రాలకు సరఫరా చేస్తున్నారు. రక్తహీనత, పౌష్టికాహార లోపంతో బాధపడుతున్న చిన్నారులు, గర్భిణులు, బాలింతలు, కిశోర బాలికలకు ఇది ఎంతగానో దోహదపడుతుంది. ఈ పరిశ్రమ ద్వారా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని అన్ని అంగన్వాడీ కేంద్రాలకు వీటిని సరఫరా చేస్తున్నారు.
ఐటీడీఏ, సెర్ప్ ద్వారా ఆర్డర్లు వస్తున్నయి. మూడు రకాల ఉత్పత్తులు చేసి విక్రయిస్తున్నం. మంచి లాభాలు వస్తున్నయి. ఒక్కో నెలలో ఒక్కోరకంగా ఆర్డర్లు ఉంటయి. కలిసికట్టుగా పనిచేసి లాభాలు పంచుకుంటున్నం.
– మంజుల, అధ్యక్షురాలు