హైదరాబాద్, ఏప్రిల్ 27 (నమస్తే తెలంగాణ): ‘స్వరాష్ట్ర సాధన కోసం నాడు టీఆర్ఎస్.. ఉజ్వల భారత్ కోసం నేడు బీఆర్ఎస్’ అని మంత్రి హరీశ్రావు పేర్కొన్నారు. పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా గురువారం ఆయన ట్వీట్ చేశారు. ‘కేసీఆర్గారి సారథ్యంలో 22 ఏండ్ల క్రితం పురుడు పోసుకొన్న ఉద్యమ పార్టీ స్వరాష్ట్ర గమ్యాన్ని ముద్దాడి నేటి బంగారు తెలంగాణకు బాటలు వేసిం ది. అనతికాలంలోనే ప్రజల ఆకాంక్షలను నెరవేర్చిన పార్టీగా నిలిచి.. దేశానికే రోల్మాడల్ అయ్యింది.
ఒకవైపు సంక్షేమం, మరోవైపు అభివృద్ధికి సమప్రాధాన్యం ఇస్తూ రాష్ట్ర సమగ్రాభివృద్ధికి నాంది పలికింది. 9 ఏండ్లలో రా ష్ట్రాన్ని అగ్రస్థానంలో నిలిపిన కేసీఆర్, తెలంగాణ అభివృద్ధి మాడల్ను దేశవ్యాప్తం చేసేందుకు బయలుదేరారు. దేశ అభివృద్ధి కోసం తలపెట్టిన మహాయజ్ఞం జాతీయస్థాయిలో విస్తరించి, మరిన్ని విజయాలు సాధించాలి. బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, దేశవిదేశాల్లోని ‘గులాబీ’ అభిమానులకు పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు.’ అని పేర్కొన్నారు.