Tatikonda Rajaiah | హైదరాబాద్ : స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరిపై బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య మరోసారి హాట్ కామెంట్స్ చేశారు. కడియం శ్రీహరి అవినీతి తిమింగలం అని రాజయ్య సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇవాళ తాటికొండ రాజయ్య మీడియాతో మాట్లాడారు.
నేను ఎమ్మెల్యే అయిన తర్వాత ఆస్తులు అమ్ముకుంటే.. కడియం మాత్రం ఆస్తుల మీద ఆస్తులు కొంటున్నాడు. కావాలంటే మా ఇద్దరి ఆస్తులను చూడండి అని రాజయ్య పేర్కొన్నారు. కడియం శ్రీహరి నిన్న విడుదల చేసి కాగితం కేవలం చిత్తు కాగితం. అది ప్రొసీడింగ్ కాపీ కాదు, కేవలం ప్రపోజల్ మాత్రమే. కనీసం సంతకం పెట్టే ధైర్యం లేని పిరికివాడు కడియం శ్రీహరి. అబద్ధపు వాదనలు ఉన్న చిత్తు కాగితాన్ని తగులబెడుతున్నాం అని తాటికొండ రాజయ్య పేర్కొన్నారు.
ఈ సందర్భంగా కడియం శ్రీహరికి తాటికొండ రాజయ్య సవాల్ విసిరారు. ప్రజల అభీష్టం మేరకే కడియం పార్టీ మారి ఉంటే రాజీనామా చేయాలి అని రాజయ్య డిమాండ్ చేశారు. కాంగ్రెస్ జెండా పట్టుకుని తెలంగాణ మొత్తం తిరగాలి. పూలదండలు వేస్తారో లేక చెప్పుల దండ వేస్తారో.. దానికి కడియం సిద్ధంగా ఉండాలి అని రాజయ్య పేర్కొన్నారు.
కడియం శ్రీహరి విడుదల చేసిన ప్రొసీడింగ్ కాపీ తగలబెట్టిన తాటికొండ రాజయ్య
కనీసం ప్రొసీడింగ్ కాపీ మీద సంతకం పెట్టడానికి కూడా ధైర్యం లేని పిరికోడు కడియం శ్రీహరి
ఎమ్మెల్యే సంతకం లేకుండా ఇచ్చిన ఈ ప్రొసీడింగ్ కాపీ చెత్త కాగితంతో సమానమని తగలబెట్టిన తాటికొండ రాజయ్య pic.twitter.com/fqUsmLu1vL
— Telugu Scribe (@TeluguScribe) September 20, 2025