KCR : రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 125 అడుగుల విగ్రహాన్ని రూపొందించిన శిల్పి, పద్మ భూషణ్ పురస్కార గ్రహీత రామ్ వంజీ సుతార్ మరణంపట్ల తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ సంతాపం వ్యక్తంచేశారు. రామ్ వంజీ ప్రముఖుల విగ్రహాలకు రూపం పోసి ప్రపంచస్థాయి ప్రతిభను కనబరిచారని కేసీఆర్ గుర్తుచేశారు. శిల్పకళా రంగంలో ఆయన కోహినూర్ వజ్రంతో పోల్చదగిన వ్యక్తి అని కొనియాడారు.
రామ్ వంజీ సుతార్ శిల్పకళా సేవలను అంబేద్కర్ విగ్రహం రూపంలో తెలంగాణ రాష్ట్రం వినియోగించుకోవడం గర్వ కారణమని కేసీఆర్ అన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో ప్రపంచ స్థాయి ప్రమాణాలతో రాష్ట్ర చరిత్రలో నిలిచిపోయే విధంగా అంబేద్కర్ విగ్రహాన్ని అత్యంత సుందరంగా తీర్చిదిద్దిన రామ్ సుతార్ తెలంగాణ ప్రజల హృదయాల్లో నిలిచి ఉంటారని పేర్కొన్నారు. రామ్ వంజీ మరణం శిల్పకళా రంగానికి తీరని లోటని విచారం వ్యక్తంచేశారు.
నిండు నూరేండ్ల జీవితాన్ని పరిపూర్ణంగా కొనసాగించి దివంగతులైన రామ్ వంజీ సుతార్ కుటుంబ సభ్యులకు కేసీఆర్ తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.