నల్లగొండ: రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల కోలాహలం కొనసాగుతున్నది. శుక్రవారం ఎన్నికల నోటిఫికేషన్ వెల్లడి కావడంతో జోరుగా నామినేషన్ల పర్వం కొనసాగుతున్నది. దేవరకొండ నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ అభ్యర్థి రమావత్ రవీంద్రకుమార్ నామినేషన్ దాఖలు చేశారు.
అంతకుముందు రవీంద్రకుమార్.. దేవరకొండ మండలం కమలాపూర్ గ్రామంలోని వీరభద్ర స్వామి ఆలయంలో నామినేషన్ పత్రాలు పెట్టి ప్రత్యేక పూజలు చేశారు. వేదపండితుల నుంచి ఆశీర్వచనం తీసుకున్నారు. అనంతరం దేవరకొండ నియోజకవర్గ బీఆర్ఎస్ ఎన్నికల ఇంచార్జ్ గుత్తా అమిత్ రెడ్డి, సీనియర్ నాయకులు నాయిని సుధీర్ రెడ్డి, వడ్త్యా రమేష్ నాయక్, మండల పార్టీ అధ్యక్షుడు టీవీఎన్ రెడ్డిలతో కలిసి రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలు సమర్పించారు.