హైదరాబాద్: ముషీరాబాద్లో బీఆర్ఎస్ అభ్యర్థి ముఠాగోపాల్ భారీ మెజారిటీతో గెలిచారు. తన సమీప ప్రత్యర్థి, కాంగ్రెస్ అభ్యర్థి అంజన్ కుమార్ యాదవ్పై ఆయన 31,264 ఓట్ల తేడాతో ఘన విజయం సాధించారు. ముఠా గోపాల్కు 59,820 ఓట్లు రాగా.. అంజన్ కుమార్ యాదవ్కు 28,556, బీజేపీ అభ్యర్థి పూస రాజుకు 25,995 ఓట్లు వచ్చాయి.