Kyathanapalli | క్యాతనపల్లి మున్సిపల్ కౌన్సిల్లో ఆడబిడ్డలపై మీద కాంగ్రెస్ దౌర్జన్యం చేయడాన్ని ఖండిస్తూ బీఆర్ఎస్, సీపీఐ ఆధ్వర్యంలో బంద్ కొనసాగుతోంది. మున్సిపాలిటీలోని వ్యాపారులు, వివిధ సంఘాలు, ప్రజలు ప్రజా తీర్పుకు మద్దతు తెలిపి బంద్లో పాల్గొన్నారు.
బంద్ సందర్భంగా మున్సిపాలిటీలో భారీగా పోలీసులు మోహరించారు. ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు వాసిరెడ్డి సీతారామయ్యను హౌస్ అరెస్టు చేశారు. ఇక నిన్న మున్సిపల్ చైర్మన్ ఎన్నిక సందర్భంగా పోలీసు సిబ్బందిపై దాడి చేశారని బాల్క సుమన్పై కేసు నమోదుచేశారు. ఈ నేపథ్యంలో బాల్క సుమన్ను అరెస్టు చేసేందుకు భారీగా పోలీసులు ఆయన ఇంటి ముందు చేరుకున్నారు. ఈ విషయం తెలిసి భారీగా బీఆర్ఎస్ శ్రేణులు అక్కడకు చేరుకున్నాయి. దీంతో బాల్క సుమన్ ఇంటి ముందు ఉద్రిక్తత నెలకొంది.