హైదరాబాద్, సెప్టెంబర్ 26 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్లో బ్రిటిష్ డిప్యూటీ హైకమిషనర్ గారెత్ విన్ ఒవెన్ సోమవారం ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితతో భేటీ అయ్యా రు. హైదరాబాద్లోని కవిత నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా గారెత్ విన్కు కవిత బతుకమ్మ చిహ్నాన్ని బహూకరించారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమం, అభివృద్ధికి గల అవకాశాలపై విస్తృతంగా చర్చించినట్టు ఎమ్మెల్సీ కవిత తెలిపారు.