హైదరాబాద్, డిసెంబర్20 (నమస్తే తెలంగాణ): పార్లమెంట్లో ఎస్సీ వర్గీకరణ బిల్లును వెంటనే ప్రవేశపెట్టి అమలు చేయాలని టీఎస్ ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు మేడి పాపన్నమాదిగ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు ఢిల్లీలోని తెలంగాణ భవన్లోని అంబేదర్ విగ్రహం వద్ద సంఘం ఆధ్వర్యంలో బుధవారం ధర్నా నిర్వహించారు. అనంతరం కేం ద్ర న్యాయశాఖ మంత్రి రాందాస్కు, సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, కార్యదర్శి రా ఘవులుకు వినతిపత్రాలు అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ వం ద రోజుల్లో ఎస్సీ వర్గీకరణ చేస్తామని హామీఇచ్చిన బీజేపీ మాట తప్పిందని, ఇటీవల ఎన్నికల్లో దీనిపై ప్రధాని మోదీ మరోసారి హామీ ఇచ్చారని, నేడు దాని గురించే మరిచారని ధ్వజమెత్తారు. గుర్రాల శ్రీనివాస్, కోండ్రు శంకర్, బాబు, యాదగిరి పాల్గొన్నారు.