వివాహమైన 18 రోజులకే..
మెదక్ మున్సిపాలిటీ, మే 29: బ్రెయిన్ స్ట్రోక్తో నవ వధువు మృతి చెందింది. ఈ ఘటన మెదక్ జిల్లా కేంద్రంలో చోటుచేసుకొన్నది. మెదక్ పట్టణానికి చెందిన అఖిల మెడికల్ స్టోర్స్ యజమాని ప్రభాకర్ కుమారుడు రాఘవేంద్రకు ఆంధ్రప్రదేశ్లోని పార్వతీపురానికి చెందిన కోటేశ్వరరావు కుమార్తె ఉష (23)తో ఈనెల 11న హైదరాబాద్లో వివాహమైంది.
కాగా ఉషకు శుక్రవారం తలనొప్పి రావడంతో మెదక్లోని దవాఖానకు తీసుకెళ్లారు. పరిస్థితి విషమంగా ఉండటంతో హైదరాబాద్లోని ఓ దవాఖానలో చేర్పించారు. చికిత్స పొందుతుండగానే హైబీపీ రావడంతో బ్రెయిన్డెడ్ అయి శనివారం అర్ధరాత్రి మరణించినట్టు వైద్యులు తెలిపారు. రాఘవేంద్ర, ఉష ప్రేమించుకోగా పెద్దలను ఒప్పించి వైభవంగా పెండ్లి చేసుకొన్నారు. పెండ్లి అయిన 18 రోజులకే ఉష మరణించడంతో ఇరుకుటుంబాల్లో విషాదం నెలకొన్నది.