హైదరాబాద్, మే 12 (నమస్తే తెలంగాణ)/ కొం డాపూర్: తనకు ఇష్టం లేని పెండ్లి చేస్తున్నారని వధువు గన్నేరు పప్పు తినడంతో పెండ్లి పీటలపైనే కుప్పకూలింది. సరిగ్గా జీలకర్ర బెల్లం పెట్టే సమయంలో పెండ్లికుమార్తె స్పృహ కోల్పోయింది. కుటుంబసభ్యులు హు టాహుటిన దవాఖానకు తరలించగా చికిత్స పొందు తూ తుది శ్వాస విడిచింది. ఈ విషాద ఘటన ఏపీలోని విశాఖపట్నం మధురవాడలో బుధవారం రాత్రి చోటుచేసుకున్నది. మధురవాడకు చెందిన శివాజీతో హైదరా బాద్లోని పాపిరెడ్డినగర్ రాజీవ్ గృహకల్పలో నివాసం ఉండే నాగోతి అప్పలరాజు, లలిత దంపతుల కుమార్తె సాయి సృజన వివాహం బుధవారం రాత్రి 7 గంటల కు మధురవాడలో జరుగాల్సి ఉన్నది.
ఇందుకు ఏర్పాట్లుచేశారు. వివాహ తంతు జరుగుతుండగా.. వధువు కుప్పకూలింది. బంధువులు ఆమెను దవాఖానకు తరలించగా తెల్లవారుజామున మృతి చెందింది. పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. సృ జనకు ఈ పెళ్లి ఇష్టంలేదనే విషయాన్ని పోలీసులు గుర్తించారు. రెం డురోజులుగా ఆమెకు అస్వస్థతగా ఉండటం తో కుటుంబసభ్యులు చికిత్స చేయించి పెం డ్లికి సిద్ధం చేశారు. పెం డ్లి ఇష్టం లేక సృజన గన్నేరుపప్పు తిన్నట్టు పోలీసులు అనుమానిస్తున్నారు.
వధువు బ్యాగులో గన్నేరు పప్పు ను కూడా గుర్తించారు. ప్రస్తుతం సృజన మృతదేహాన్ని కేజీహెచ్ మార్చురీలో ఉంచారు. పోస్టుమార్టం తర్వాత శరీరంలో విష అవశేషాలు ఏమైనా ఉన్నాయా? లేదా? అనే విషయం తేలనున్నది. ఆ తర్వాతే సృజనది ఆత్మహత్య? ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా? అనే కోణం తెలియనున్నది. సృజన మృతిలో పాపిరెడ్డినగర్ రాజీవ్ గృహకల్పలో అక్కడ విషాద ఛాయలు అలుముకున్నాయి.