జమ్ము, ఆగస్టు 7: తగినంతమంది యాత్రికులు లేకపోవటంతో అమర్నాథ్ యాత్రను ఆదివారం వరుసగా రెండోరోజు కూడా నిలిపివేశారు. అమర్నాథ్ మంచు లింగాన్ని దర్శించుకొనేందుకు వచ్చిన కొద్దపాటి యాత్రికులను భగవతినగర్ బేస్ క్యాంపు వద్దనే ఆపేశారు. ఈ నెల 11తో అమర్నాథ్ యాత్ర ముగుస్తుంది. ఆ లోపు మరో బ్యాచ్ యాత్రికులను దర్శనానికి పంపే అవకాశం ఉన్నదని అధికారులు తెలిపారు.