హైదరాబాద్, జూలై 31(నమస్తే తెలంగాణ): బెస్ట్ పథకం కింద 266 మంది లబ్ధిదారులకు రూ. 7,46,62,964 విడుదల చేయాలని బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ నిర్ణయించింది. వివేకానంద విదేశీ విద్యా పథకం కింద 62 మంది విద్యార్థులకు ఉపకార వేతనాలు ఇవ్వాలని తీర్మానించింది. శనివారం బొగ్గులకుంటలోని దేవాదాయశాఖ కార్యాలయంలో పరిషత్ అధ్యక్షుడు కేవీ రమణాచారి అధ్యక్షతన నిర్వహించిన కార్యనిర్వాహక కమిటీ సమావేశంలో వివిధ పథకాల లబ్ధిదారులకు నిధులు విడుదలచేయాలని నిర్ణయించారు. శ్రీరామానుజ ఫీజు రీయింబర్స్మెంట్ పథకం కింద 22 మందికి రూ.3.30 లక్షలు అందజేయనున్నారు. 75 ఏండ్లు పైబడిన తొమ్మిది మంది పేద వేద పండితులు ఒక్కొక్కరికి నెలకు రూ. 2,500 చొప్పున గౌరవ వేతనం, మేడ్చల్మల్కాజిగిరి జిల్లాలోని ఒక వేద పాఠశాలకు రూ.రెండు లక్షలు ఆర్థిక సహాయం అందించేందుకు కమిటీ తీర్మానించిందని సంక్షేమ పరిషత్ పాలనాధికారి చంద్రమోహన్ తెలిపారు.