హైదరాబాద్ : తెలంగాణ బ్రాహ్మణ సంక్షేమ పరిషత్తు కార్యనిర్వాహక కమిటీ సమావేశం శనివారం జరిగింది. పరిషత్తు అధ్యక్షులు కె.వి.రమణాచారి అధ్యక్షతన ఈ భేటీ జరిగింది. 2021-22 విద్యాసంవత్సరానికి 62 మంది విద్యార్థులకు వివేకానంద విదేశీ విద్యాపథకం కింద ఉపకార వేతనాలు మంజూరు అయినట్లు తెలిపారు. అదేవిధంగా 266 మంది ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను త్వరలోనే రూ.7.46 కోట్ల రాయితీ త్వరలోనే బ్యాంకు ఖాతాల్లో జమ కానున్నట్లు చెప్పారు. 75 ఏళ్లు పైబడిన 9 మంది పండితులకు రూ.2,500 గౌరవ వేతనం లభించనున్నట్లు తెలిపారు. నాగోల్లోని వేదపాఠశాలకు రూ.2 లక్షల ఆర్థికసాయం అందజేయనున్నట్లు ఆయన పేర్కొన్నారు.