హైదరాబాద్, అక్టోబర్ 25 (నమస్తే తెలంగాణ): యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి దేవాలయ గోపురానికి స్వర్ణ తాపడం కోసం బ్రాహ్మణ సంక్షేమభవన్ తరఫున 3.16 కేజీల బంగారాన్ని విరాళంగా ఇవ్వనున్నట్టు భవన్ వ్యవస్థాపకుడు గిరిప్రసాద్శర్మ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. బ్రాహ్మణ సమాజంలోని పలువురు దాతలు, సంక్షేమభవన్ సభ్యులందరి సహకారంతో డిసెంబర్ 9న సుబ్రహ్మణ్యషష్ఠి సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ను కలిసి బంగారం కానీ, అందుకు సరిపడా నగదు కానీ అందజేస్తామని పేర్కొన్నారు. ఇప్పటికే పలువురు దాతలు సహాయం చేశారని చెప్పారు. యాదాద్రి ఆలయాన్ని అద్భుతంగా పునర్నిర్మించిన కేసీఆర్ ఎంతో గొప్ప ధార్మిక ముఖ్యమంత్రి అని శర్మ కొనియాడారు.
–బ్రాహ్మణ సంక్షేమభవన్ వ్యవస్థాపకుడు
గిరిప్రసాద్శర్మ