యాచారం, ఏప్రిల్ 15: పుడమిని పరిరక్షించాలని పదకొండేండ్ల బాలుడు యాత్ర చేపట్టాడు. హైదరాబాద్ నాగోల్కు చెందిన సుహాస్ 8వ తరగతి చదువుతున్నాడు. పెరుగుతున్న కాలుష్యంతో పర్యావరణానికి, పుడమితల్లికి కలిగే నష్టాలపై పాఠ్యంశాల్లో చదువుకొన్నాడు. భూమి తల్లిని పరిరక్షించాలని ప్రజలకు అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో నాగోల్ నుంచి నాగార్జునసాగర్ వరకు స్కేటింగ్ చేస్తూ యాత్రను చేపట్టాడు. ఇందులో భాగంగా శుక్రవారం రంగారెడ్డి జిల్లా యాచారం చేరుకొన్నాడు. పర్యావరణ పరిరక్షణకు ఈ బాలుడు చేస్తున్న కృషిని ఎంతోమంది ప్రశంసిస్తున్నారు.