మర్కూక్, జనవరి 7: పతంగి ఎగురవేస్తుండగా విద్యుత్తు తీగలు తగిలి బాలుడు మృతిచెందాడు. ఈ ఘటన సిద్దిపేట జిల్లా మర్కూక్ మండల కేంద్రంలో ఆదివారం చోటుచేసుకున్నది. మర్కూక్కు చెంది న బుర్ర సాత్విక్ (10) స్నేహితులతో కలిసి పతంగులను ఎగురవేశాడు. అయితే.. బాలుడి తండ్రి బుర్ర అశోక్.. సాత్విక్ను బావి వద్దకు తీసుకెళ్లాడు. బావి దగ్గర ఆడుకుంటుండగా బాలుడికి సన్నటి కాపర్ వైరు దొరికింది. ఆ వైర్ను గాలిపటానికి కట్టుకొని గాల్లోకి ఎగురవేశాడు. ఈ క్రమంలో బావి వద్ద ఉన్న 11 కేవీ విద్యుత్తు తీగలకు కాపర్ వైర్ తగలడంతో బాలుడు ఒక్కసారిగా కుప్పకూలాడు. వెంటనే బాలుడికి సీపీఆర్ చేసినా ఫలితం లేకుండా పోయింది. గజ్వేల్ దవాఖానకు తరలించగా అప్పటికే సాత్విక్ మృతి చెందాడు.
మాంజాతో తెగిన చెవి
పతంగి మాంజా తగిలి ఓ వ్యక్తి చెవి తెగిపోగా మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన కామారెడ్డి జిల్లా భిక్కనూర్లో శనివారం సాయంత్రం చోటుచేసుకున్నది. మండలంలోని తిప్పాపూర్కు చెందిన సాయి, అర్విం ద్ ద్విచక్ర వాహనంపై భిక్కనూరు నుంచి రామాయంపేటకు బయల్దేరారు. సిద్ధరామేశ్వర స్వామి ఆలయ కమాన్ వద్దకు చేరుకోగానే పిల్లలు ఎగురవేస్తున్న గాలిపటం మాంజా తగిలి అర్వింద్ చెవి తెగిపోగా, సాయి ముఖం, మెడపై గాయాలయ్యాయి. ఇద్దరిని చికిత్స నిమిత్తం కామారెడ్డి దవాఖానకు తరలించారు.