డిచ్పల్లి, మే 2: ఆడుకొంటూ వెళ్లి నీళ్ల బకెట్లో పడి ఏడాదిన్న బాలుడు మృతిచెందిన విషాద ఘటన నిజామాబాద్ జిల్లా డిచ్పల్లి మండలం మిట్టాపల్లితండాలో ఆదివారం చోటు చేసుకున్నది. గ్రామస్థులు, పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం.. గ్రామానికి చెందిన బుక్క రాంచందర్-ప్రమీల దంపతులకు ఒక్కగానొక్క కొడుకు కౌశిక్ (ఏడాదిన్నర) ఉన్నాడు. ఆదివారం మధ్యాహ్నం ఇంటి ముందు ఆడుకుంటూ వెళ్లి నీటి బకెట్లో పడిపోయాడు. గమనించిన కుటుంబ సభ్యులు బాలుడిని బయటికి తీసి నిజామాబాద్ దవాఖానకు తరలించగా, చికిత్స పొందుతూ మృతిచెందాడు. ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై గణేశ్ తెలిపారు.