ఏటూరునాగారం, అక్టోబర్ 19 : ఐదేండ్ల బాలుడు కరెంట్ వాటర్ హీటర్ షాక్కు గురై మృతిచెందిన ఘటన ములుగు జిల్లా ఏటూరునాగారంలో చోటుచేసుకొన్నది. జగజంపుల స్వామి, శిరీష కొడుకు నిఖిల్(5) బుధవారం సాయంత్రం బాత్రూమ్లో కరెంట్ వాటర్ హీటర్ పెట్టి ఉన్న నీళ్ల బకీట్ను తగిలాడు. దాంతో ఆ బాలుడు షాక్కు గురై కిందపడిపోయాడు. తల్లిదండ్రులు ప్రభుత్వ దవాఖానకు తరలిస్తుండగా నిఖిల్ మృతిచెందాడు.
జాగ్రత్తలివీ : పిల్లలు ఆడుతున్న ఇంటి ప్రదేశాల్లో వాటర్ హీటర్ అస్సలు పెట్టొద్దు. హీటర్ స్విచ్ ఆన్ చేసినప్పుడు పిల్లలు అటువైపు వెళ్లకుండా చూడాలి. ఒకవేళ బాత్రూంలో పెట్టినా తలుపులు మూసి ఉంచడం మంచిది.