దుగ్గొండి, మే 17 : క్రికెట్ ఆడుతూ ప్రమాదవశాత్తు బంతి తలకు తగలడంతో బాలుడు మృతి చెందాడు. ఈ ఘటన వరంగల్ జిల్లా దుగ్గొండి మండలం గిర్నిబావి గ్రామంలో చోటుచేసుకున్నది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. గిర్నిబావికి చెందిన బాసాని మాధవి భర్తతో విభేదాల కారణంగా కొన్నేండ్లుగా కుమారుడు అనుష్ చంద్ర(11)తో కలిసి తల్లిదండ్రుల వద్ద ఉంటున్నది.
ప్రస్తుతం పాఠశాలలకు వేసవి సెలవులు కావడంతో రెండు రోజుల క్రితం గ్రామంలోని స్థానిక పిల్లలతో కలిసి అనుష్చంద్ర క్రికెట్ ఆడుతుండగా ప్రమాదవశాత్తు బంతి తలకు తగిలి తీవ్ర గాయాలయ్యాయి. బాధితుడిని నిమిత్తం దవాఖానకు తరలించగా ఆదివారం ఉదయం మృతి చెందినట్టు కుటుంబ సభ్యులు తెలిపారు.