Gurukula Jobs | న్యూస్నెట్వర్క్, మార్చి 2 (నమస్తే తెలంగాణ): వారంతా చిన్నప్పుడు సరస్వతీ పుత్రులుగా రాణించారు. ఇప్పుడు ఉద్యోగాల వేటలో అలుపెరుగని కృషి చేసి జాక్పాట్ కొట్టారు.
మెదక్ జిల్లా గజ్వేల్కు చెందిన అమరవాది మృణాళిని, హనుమకొండ జిల్లాకు చెందిన పల్లెర్ల రసజ్జ, జగిత్యాల జిల్లా పెగడపల్లి మండలం ల్యాగలమర్రికి చెందిన పుప్పాల మమత ఇటీవల వెల్లడైన గురుకుల పరీక్షల ఫలితాల్లో ఒక్కొక్కరు ఐదు ఉద్యోగాలకు అర్హత సాధించారు. మృణాళిని ప్రస్తుతం ఉస్మానియా విశ్వవిద్యాలయంలో రావి సీతాదేవి ఆధ్వర్యంలో ‘రామాయణం పద్య కావ్యం’పై పీహెచ్డీ చేస్తున్నది. రసజ్ఞ ప్రస్తుతం ఉస్మానియా యూనివర్సిటీ కెమిస్ట్రీ విభాగంలో పీహెచ్డీ చేస్తున్నది.
జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలం చౌలమద్ది అనుబంధ గ్రామమైన మారుతీనగర్కు చెందిన భార్యాభర్తలు శనిగరం విజయ్కుమార్ – స్వప్నికలు ఒకేసారి ప్రభుత్వ ఉద్యోగాలు సాధించారు. విజయ్కుమార్ జేఎల్తోపాటు టీజీటీ(సోషల్)కు ఎంపికయ్యారు. ఆయన భార్య స్వప్నిక టీజీటీ(ఇంగ్లిష్) పోస్టుకు అర్హత సాధించారు.