హైదరాబాద్, నవంబర్ 11 (నమస్తే తెలంగాణ): ప్రయాణికులతో అనుబంధాన్ని పెంచేందుకు టీఎస్ఆర్టీసీ చర్యలు చేపడుతు న్నది. పెండ్లిళ్లకు బస్సులను కిరాయికి తీసుకుంటే వధూవరులకు ఆర్టీసీ తరఫున బహుమతులివ్వాలని ఎండీ సజ్జనార్ ఆదేశించా రు. ఇప్పటివరకు 475 జంటలకు పెండ్లి కానుకలు అందజేశారు. గురువారం యాదగిరిగుట్ట నుంచి కొంపల్లికి రెండు బస్సులను అద్దెకు తీసుకున్న నేపథ్యంలో వరుడు ఆకుల భరత్, వధువు సౌమ్య వివాహానికి సజ్జనార్ హాజరై కానుకలను బహూకరించారు.
హైదరాబాద్ లోని అన్ని ప్రాంతాలకు సికింద్రాబాద్, నాంపల్లి, కాచిగూడ రైల్వేస్టేషన్లతోపాటు ఎంజీబీఎస్, జేబీఎస్ బస్స్టాండ్ల నుంచి తెల్లవారుజామున 4 గంటల నుంచే సిటీ సర్వీస్లను నడుపుతున్నట్టు సజ్జనార్ తెలిపారు. ఏమైనా సమస్యలు ఉంటే @tsrtcmdoffice ట్విట్టర్ ఖాతాకు సమాచారమిస్తే, పరిష్కరిస్తామని తెలిపారు.