హైదరాబాద్, అక్టోబర్ 20 (నమస్తే తెలంగాణ)/సిటీబ్యూరో: తెలుగు సాహిత్యంలో ‘జూలూరు పథం’ పుస్తకం ఓ మైలురాయిలా నిలిచిపోతుందని మాజీ ఎమ్మెల్సీ, ప్రముఖ విద్యావేత్త చుకారామయ్య కొనియాడారు. హైదరాబాద్ రవీంద్రభారతిలో ఆదివారం జరుగనున్న ‘జూలూరు పథం’ పుస్తకావిషరణకు వయోభారం తో హాజరుకాలేకపోతున్న చుకా రామయ్యను శుక్రవారం ఆయన నివాసంలో తెలంగాణ సాహి త్య అకాడమీ చైర్మన్, పుస్తక రచయిత జూలూరు గౌరీశంకర్ కలిసి పుస్తకాన్ని అందచేశారు. కవిగా, రచయితగా, సామాజిక కార్యకర్తగా 45 ఏండ్ల తన ప్రయాణాన్ని ‘జూలూరు పథం’ దీర్ఘకావ్యంగా రాసినట్టు వివరించారు. ఈ పుస్తకంలో ఆత్మ జూలూరుది, కథ తెలంగాణది అని చుక్కా రామయ్య పేరొన్నారు. 14 ఏండ్లు విద్యారంగ సమస్యలపై కలిసి చేసిన రచనలు, రాష్ట్ర సాధన ఉద్యమంలో కలిసి పనిచేసిన సందర్భాలను ఈ సందర్భంగా వారు గుర్తు చేసుకున్నారు. ఈ మట్టి గర్వించదగిన నాటి తెలంగాణ సాయుధ పోరాట యోధునికి, ఈ కాలపు రామానుజన్ చుకారామయ్యకు తన ‘ జూలూరు పథం’ పుస్తకాన్ని అందించి ఆశీర్వాదం తీసుకోవడం గర్వంగా ఉన్నదని గౌరీశంకర్ తెలిపారు.