హైదరాబాద్, జూలై 18 (నమస్తేతెలంగాణ) : తెలంగాణ సమాచార పౌర సంబంధాలశాఖ సమాచార భవన్లో బోనాల ఉత్సవాలు శుక్రవారం ఘనంగా నిర్వహించారు. సమాచార శాఖ ఉద్యోగుల కల్చరల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కార్యాలయ ప్రాంగణంలోని కనకదుర్గ అమ్మవారి దేవాలయంలో బోనాల సంబురాలు నిర్వహించారు.
సమాచారశాఖ ప్రత్యేక కమిషనర్ సీహెచ్ ప్రియాంక ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.