హైదరాబాద్, జూలై 1 (నమస్తే తెలంగాణ): తెలంగాణ సంసృతీ సంప్రదాయాలకు అద్దంపట్టే బోనాల పండుగను వైభవంగా నిర్వహించేలా అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులను మంత్రులు ఇంద్రకరణ్రెడ్డి, తలసాని శ్రీనివాస్యాదవ్ ఆదేశించారు. బోనాల ఏర్పాట్లు, నిర్వహణపై మంగళవారం సచివాలయంలో మంత్రులు సమీక్ష నిర్వహించారు. ఉత్సవాలకు ఈ ఏడాది కేటాయించిన రూ.15 కోట్లను వినియోగించుకోవాలని సూచించారు. 9న సికింద్రాబాద్ మహాంకాళి బోనాలు, 16న హైదరాబాద్ పాతబస్తీ బోనాలు నిర్వహించనున్నట్టు తెలిపారు. 26 దేవాలయాల్లో ప్రభుత్వం తరఫున పట్టువస్ర్తాలు సమర్పించేందుకు అన్ని ఏర్పాట్లు చేయాలని చెప్పారు. బోనాల ఉత్సవాలకు వారం రోజుల ముందే ప్రత్యేక ఆర్థిక సహాయం చెక్లు అందజేయాలని అధికారులకు సూచించారు. బోనాలకు వచ్చే భక్తుల కోసం ఆలయ కమిటీలు, అధికారులు ఏర్పాట్లు చేయాలని చెప్పారు. సాంసృతిక కార్యక్రమాలను నిర్వహించాలని ఆదేశించారు. ఈ సమావేశంలో దేవాదాయ, పర్యాటక, సమాచార శాఖల అధికారులు పాల్గొన్నారు. అనంతరం సికింద్రాబాద్ మహంకాళీ బోనాలకు రావాలని మంత్రులను ఆలయ కమిటీ ఆహ్వానించింది.