జగిత్యాల : రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగం అభివృద్ధికి సాహసోపేత నిర్ణయాలు తీసుకుందని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్కుమార్(MLA Sanjay Kumar) తెలిపారు. జగిత్యాల రూరల్ మండలం చల్గల్ గ్రామంలో మినీ లైబ్రరీని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మన ఊరు-మన బడి(Mana Ooru-Mana Badi) కింద పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు మెరుగు అవుతున్నాయని అన్నారు. దీంతో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల చేరిక సంఖ్య రెట్టింపు(Students Increase) అవుతుందని పేర్కొన్నారు.
సన్న బియ్యం, గురుకుల పాఠశాలల ఏర్పాటు, ఆంగ్ల విద్య బోధన,మహిళల కోసం యూనివర్సిటీ ఏర్పాటు తదితర కార్యక్రమాలు విద్యారంగ అభివృద్ధికి ఉపయోగపడుతున్నాయని వెల్లడించారు.ప్రతి గ్రామంలో లైబ్రరరీల ఏర్పాటు వల్ల పోటీ పరీక్షల విద్యార్థులకు నాణ్యమైన పుస్తకాలు అందుబాటులో ఉంచడంతో పాటు దూర భారం తగ్గి చదువుపై దృష్టి పెట్టే అవకాశం ఉంటుందని అన్నారు.
జడ్పీ చైర్పర్సన్ దావా వసంత సురేష్, గ్రంథాలయ సంస్థ చైర్మన్ డాక్టర్ చంద్రశేకర్ గౌడ్, అదనపు కలెక్టర్ మంద మకరందు తదితరులు పాల్గొన్నారు. విద్యా దినోత్సవం సందర్భంగా ప్రభుత్వ పాఠశాల లో చదివి 9.8 జీపీఏ సాధించి జిల్లా టాపర్గా నిలిచిన సానియాను ఎమ్మెల్యే శాలువాతో సన్మానించి అభినందించారు.