కరీంనగర్ : ఒక వార్తను ప్రచురించేటప్పుడు అన్ని విధాల వివరాలు తెలుసుకొని ప్రచురించాలని ఇలా తప్పుడు ప్రచారాలు చేయవద్దని మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్(Boinapally Vinod Kumar )అన్నారు. ఆదివారం కరీంనగర్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. క్యూ న్యూస్(Q News)లో తీన్మార్ మలన్ననా అన్నబిడ్డ స్వప్నకు జెన్కో(Genco)లో అర్హత లేకున్నా సీఎండీ ప్రభాకర్ రావు ఉద్యోగం ఇచ్చారని వార్త ఇచ్చారు. నాకు అన్ననే లేడు ఆ స్వప్న ఎవరోఎమిటో తెలియదు అని పేర్కొన్నారు.
వాస్తవాలు తెలుసుకోకుండా వార్తలు ఇవ్వడం ఏమిటని ప్రశ్నించారు. క్రాస్ చెక్ చేసుకొని వార్త ఇవ్వాలి దాన్ని జర్నలిజం అంటారని హితవు పలికారు. బోయినపల్లి ఇంటి పేరు ఉన్నంత మాత్రాన బంధుత్వం ఎలా అంటగడుతారని ప్రశ్నించారు. నేను ఎంపీగా ప్లానింగ్ బోర్డ్ చైర్మన్గా ఉన్న సమయంలో ఏ అధికారికారి పైన అయిన ఒత్తిడి చేశానో చెప్పాలని డిమాండ్ చేశారు.
రాజకీయంగా బద్నాం చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఆర్థిక నేరగాడు నీరజ్ మోదీ నరేంద్ర మోదీ బంధువులు అవుతారా బీజేపీ సోషల్ మీడియా మిత్రులు గ్రహించాలన్నారు. రాజకీయ పోరాటం ఉండాలి కానీ తప్పుడు ప్రచారం చేయడం ఏమిటని ప్రశ్నించారు. అమ్మాయికి నాకు సంబంధం ఏమిటి ప్రూ చేయగలరా అని డిమాండ్ చేశారు. ఎన్నికల నోటిఫికేషన్ రానివ్వండి ఎవరు ఏమి చేశారో చెప్తామన్నారు.