శంకరపట్నం : చంద్రయాన్-3 విజయవంతం ఘనత తనది అని చెప్పుకోవడం ప్రధాని నరేంద్ర మోదీకి సిగ్గుచేటని రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్కుమార్ (Boinapalli Vinodkumar) విమర్శించారు. ఆదివారం కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం మొలంగూర్లో నిర్వహించిన బీఆర్ఎస్( BRS) యువగర్జన సభలో మానకొండూర్ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్తో కలిసి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. చంద్రయాన్-3 (Chandrayan-3) ని విజయవంతం చేసిన ఇస్రో (ISRO) శాస్త్రవేత్తలకు కృతజ్ఞతలు తెలిపారు. కర్ణాటకలో ఇస్రో సైంటిస్టుల సత్కార సభలో మోదీ ప్రోటోకాల్ పాటించకపోవడం బాధాకరమన్నారు. గతంలోనూ సీఎం కేసీఆర్ను సైతం వ్యాక్సిన్ ఆవిష్కరణ సందర్భంలో ఇదే తీరున వ్యవహరించారని గుర్తు చేశారు. మోదీ నియంతృత్వ పోకడలకు పోతున్నారని మండిపడ్డారు.
అనేక పోరాటాలతో సిద్ధించిన తెలంగాణలో సీఎం కేసీఆర్ (CM KCR) ప్రజారంజక పాలన అందిస్తున్నారని కొనియాడారు. అన్ని వర్గాలకు సంక్షేమ ఫలాలు అందిస్తున్నారని చెప్పారు. ఇందుకు భిన్నంగా ప్రధాని మోదీ (Narendera Modi) ప్రచార్భాటం చేస్తూ తప్పుదోవ పట్టిస్తున్నారని ధ్వజమెత్తారు.
మత రాజకీయాలు చేసి, ప్రజలను తప్పుదోవపట్టించి కరీంనగర్ పార్లమెంట్లో విజయం సాధించారన్నారు. కాంగ్రెస్ పాలనంతా చీకటిమయమని విమర్శించారు. 1969 తెలంగాణ ఉద్యమంలో 369 మందిని పిట్టల్లా కాల్చి చంపిన చీకటి చరిత్ర ఆ పార్టీదన్నారు. అలాంటి పార్టీని నమ్మితే అధోగతి పాలుకాకతప్పదన్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండి పనిచేసే ప్రభుత్వాన్ని ఆదరించాలని కోరారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు జీవీ రామకృష్ణారావు, మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్రావు పాల్గొన్నారు.