హైదరాబాద్, ఆగస్టు 26 (నమస్తే తెలంగాణ): భవిష్యత్తు తరాలకు చరిత్రే మూలమని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బీ వినోద్కుమార్ తెలిపారు. శనివారం హైదరాబాద్లోని డాక్టర్ మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రంలో ‘తెలంగాణ ల్యాండ్ అండ్ పీపుల్’ పుస్తకావిష్కరణ కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై, మాట్లాడారు. ‘తెలంగాణ ల్యాండ్ అండ్ పీపుల్’ ఇప్పటికే పేరుతో రెండు పుస్తకాలు ఆవిష్కరించామని, ఇది మూడోదని తెలిపారు. ఒక పుస్తకం ఎన్నో ఏండ్ల చరిత్రను పదిల పరుస్తుందని చెప్పారు. తెలంగాణలో చారిత్రక సంపదను వెలికితీస్తున్నట్టు పేర్కొన్నారు. ప్రస్తుత తరాలు భవిష్యత్తు కోసం ఆలోచించి ప్రస్తుత, గత చరిత్రను భద్రపరచాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంసీఆర్ హెచ్ఆర్డీ డైరెక్టర్ జనరల్ డాక్టర్ శశాంక్ గోయల్, ఏకే గోయల్, రావుపాటి మాధవి, రేఖ పాండే, జరీనాప్రవీణ్ పాల్గొన్నారు.