సూర్యాపేట : చేపల వేటకు వెళ్లిన ఇద్దరు యువకుల మృతదేహాలు కృష్ణానదిలో లభ్యమయ్యాయి. చింతలపాలెం మండలం పాత అడ్లూరు వద్ద కృష్ణా నదిలో ఇద్దరు యువకులు జనవరి 17న చేపల వేటకు వెళ్లారు. ప్రమాదవశాత్తు నదిలో మునిగిపోయారు.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని గాలింపు చర్యలు చేపట్టారు. 48 గంటల తర్వాత గజ ఈతగాళ్లు.. ఇద్దరు యువకుల మృతదేహాలను నదిలో నుంచి బయటకు తీశారు. మృతులను కొమ్ము గోపీ, కందుకూరి చంద్రశేఖర్గా పోలీసులు గుర్తించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం హుజుర్నగర్ ఆస్పత్రికి తరలించారు. మృతుల నివాసాల్లో విషాదఛాయలు అలుముకున్నాయి.