హైదరాబాద్ : రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీసీ బస్సు డిపోల్లో మంగళవారం రక్తదాన శిబిరాలు నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా రక్తదానం చేసిన వారికి రేపు రోజు ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించేందుకు రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ అవకాశం కల్పించింది. రాష్ట్రంలోని తలసీమియా బాధితుల కోసం ఆర్టీసీ రక్తదాన శిబిరాలు నిర్వహిస్తున్నది. రెడ్క్రాస్ సంస్థతో కలిసి రక్తదాన శిబిరాలను ఆర్టీసీ ఏర్పాటు చేసింది. ఈ సందర్భంగా ఆర్టీసీ ఉద్యోగులు సైతం రక్తదానానికి ముందుకు రావాలని సంస్థ ఎండీ సజ్జనార్ పిలుపునిచ్చారు.