హైదరాబాద్ సిటీబ్యూరో, జూలై 8 (నమస్తే తెలంగాణ): కరోనా నుంచి కోలుకొన్న తరువాత కొందరిలో ప్రాణాంతక మ్యూకోర్మైకోసిస్ ఫంగల్ ఇన్సెఫెక్షన్ (బ్లాక్ ఫంగస్) సోకే ప్రమాదాన్ని అంచనా వేయడానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) సాంకేతికతను హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ప్రొఫెసర్లు అభివృద్ధి చేశారు.
స్కూల్ ఆఫ్ మేనేజ్మెంట్ స్టడీస్ ప్రొఫెసర్ బెల్లంకొండ రాజశేఖర్, ప్రొఫెసర్ జీవీఆర్కే ఆచార్యతో పాటు మరికొందరు ప్రొఫెసర్లు దీనిని అభివృద్ధి చేసినట్టు హెచ్సీయూ అధికారులు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. రోగులు దవాఖాన నుంచి డిశ్చార్జి అయ్యే సమయంలోనే ఏఐ ద్వారా ఫంగల్ ఇన్ఫెక్షన్ సోకే ప్రమాదాన్ని అంచనా వేయడం వల్ల వారికి మెరుగైన వైద్యం చేయడానికి అవకాశం ఉంటుందని పేర్కొన్నారు.