కరీంనగర్ తెలంగాణచౌక్, సెప్టెంబర్ 15 : ‘దేశ స్వాతంత్య్ర పోరాటంలో బీజేపీ పాత్ర శూన్యం.. దేశ భక్తులమని చెప్పుకొనే హక్కు ఆ పార్టీ నాయకులకు లేదు’ అని మాజీ ఎమ్మె ల్సీ, ప్రొఫెసర్ కే నాగేశ్వర్ విమర్శించారు. అనేక జాతులు, మతాలు, తెగలు సమైక్యంగా ఉన్న దేశంలో కుల, మతాల పేరిట చిచ్చు రగిలించేందుకు బీజేపీ కుట్రలు చేస్తున్నదని మం డిపడ్డారు. ‘మా దేహం ముక్కలైనా దేశాన్ని ముక్కలు కానివ్వం’ అని ఆయన స్పష్టం చేశారు. కరీంనగర్లో జరుగుతున్న ఎస్ఎఫ్ఐ నాలుగో మహాసభల్లో గురువారం ఆయన ప్రసంగించారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని విమోచన దినోత్సవం అంటూ బీజేపీ చరిత్రను వక్రీకరిస్తున్నదని దుయ్యబట్టా రు.
ఈ సందర్భాన్ని హిందూ, ముస్లింల మధ్య గొడవలుగా చిత్రీకరించేందుకు యత్నిస్తున్నదని తప్పుబట్టారు. తెలంగాణ సాయుధ పోరాటంలో షోయబుల్లాఖాన్తోపాటు మరెందరో ముస్లింలు పాల్గొన్నారని గుర్తుచేశారు. కశ్మీర్ ఫైల్స్ లాంటి సినిమాల ను నిర్మించి ప్రజలను విభజించేందుకు కుతంత్రాలు చేస్తున్నదని నిప్పులు చెరిగారు. ప్రధా ని మోదీ పాలనలో పౌరహక్కులు ప్రశ్నార్థకమయ్యాయని ధ్వజమెత్తారు. కేంద్రంలోని పెద్దలు అంగట్లో సరుకులా ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి ప్రజాస్వామిక ప్రభుత్వాలను కూల్చివేస్తూ రాజకీయ వ్యభిచారానికి పాల్పడుతున్నట్టు విరుచుకుపడ్డారు.