నాంపల్లి, అక్టోబర్ 27: రాజ్యాంగబద్ధంగా ఏర్పాటైన ఇతర పార్టీల ప్రభుత్వాలను కూల్చడమే బీజేపీ నేతల లక్ష్యంగా ఉన్నదని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ విమర్శించారు. గురువారం మునుగోడు నియోజకవర్గం నాం పల్లిలో మంత్రి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. మహారాష్ట్ర, గోవా రాష్ర్టాల్లో మాదిరిగా తెలంగాణ ప్రభుత్వాన్ని కూల్చేందుకు బీజేపీ కుట్రలు పన్నుతున్నదని మండిపడ్డారు. సీఎం కేసీఆర్ ఉన్నంతకాలం బీజేపీ డ్రామాలు సాగవని స్పష్టంచేశారు. రూ.18వేల కోట్ల కాంట్రాక్టుల కోసం అమ్ముడుపోయిన రాజగోపాల్రెడ్డిని మునుగోడు ప్రజలు ఓడించడానికి సిద్ధంగా ఉన్నారని తెలిపారు.