గంగాధర, జనవరి 13 : రాజకీయాలు చేయడం కాదు ఆపద సమయంలో అక్కున చేర్చుకొని ఆదుకోవడమే సీఎం కేసీఆర్ ధ్యేయమని ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ పేర్కొన్నారు. కరీంనగర్ జిల్లా గంగాధర మండలం కురిక్యాల గ్రామానికి చెందిన బీజేపీ కార్యకర్త గుండారపు కనుకయ్య ఇటీవల మృతి చెందగా ఆయన కుటుంబ సభ్యులకు రైతు బీమా కింద రూ.5 లక్షల పరిహారం మంజూరైంది. ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ శుక్రవారం స్వయంగా కనుకయ్య ఇంటికి వెళ్లి ఆయన తల్లి గంగవ్వకు రైతు బీమా ప్రొసీడింగ్ పత్రాన్ని అందజేశారు. ఆపద సమయంలో రాజకీయాలను పక్కన పెట్టి సీఎం కేసీఆర్ రైతులకు ఆపద్బాంధవుడిగా నిలుస్తున్నాడని గ్రామస్థులు కొనియాడారు.