నల్లగొండ : నాగార్జున సాగర్ ఉప ఎన్నికలోనూ తామే గెలుస్తామని బీరాలు పలికిన బీజేపీ నేతల ఆశలు గల్లంతు అయ్యాయి. కారు దూకుడుకు కమలం ఖతం అయింది. కనీసం డిపాజిట్ను కూడా దక్కించుకోలేకపోయింది కమలం పార్టీ. ఆ పార్టీ అభ్యర్థి రవికుమార్కు అభ్యర్థిత్వాన్ని సాగర్ ఓటర్లు తిరస్కరించారు. సాగర్ను అభివృద్ధి చేస్తున్న నాయకులపై విమర్శలు చేసినా భారతీయ ఝూటా పార్టీకి ఆ నియోజకవర్గ ప్రజలు తగిన రీతిలో బుద్ది చెప్పారు. కేంద్ర మంత్రితో పాటు బీజేపీ ఎంపీలు చేసిన ప్రచారం ఏ మాత్రం పనికి రాలేదు. ఇప్పటి వరకు 13 రౌండ్ల ఫలితాలు వెలువడినప్పటికీ ఏ రౌండ్లోనూ వెయ్యి ఓట్లు కూడా దాటలేదు. ఈ క్రమంలో అటు నల్లగొండలో, ఇటు హైదరాబాద్లో బీజేపీ కార్యాలయం బోసిపోయింది.