D Raja | హైదరాబాద్, ఫిబ్రవరి 2 (నమస్తే తెలంగాణ): ప్రధాని మోదీ దేశంలో ప్రజాస్వామ్యాన్ని అంతమొందించి, ఏకస్వామ్య, ఫాసి స్టు, నియంతృత్వ వ్యవస్థను తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నారని సీపీఐ జాతీయ ప్రధానకార్యదర్శి డీ రాజా విమర్శించారు. మూడు రోజుల సీపీఐ జాతీయ సమితి సమావేశాలు శుక్రవారం హైదరాబాద్లోని సీపీఐ రాష్ట్ర కార్యాలయంలో ప్రారంభమయ్యాయి. ఈ సమావేశాల్లో రాజా మాట్లాడుతూ.. అధ్య క్ష తరహా పరిపాలన దిశగానే.. ఒకే దేశం- ఒకే ఎన్నిక అనే నినాదాన్ని మోదీ తెరపైకి తీసుకొస్తున్నారని ఆరోపించారు.
త్వరలో జరుగనున్న లోక్సభ ఎన్నికల్లో దేశాన్ని బీజేపీ చేతిలో నుంచి విముక్తి కల్పించాలని పిలుపునిచ్చారు. మరోసారి మోదీ అధికారంలోకి వస్తే దేశం, దేశ భవిష్యత్తు ఏమవుతుందో అనే ఆందోళన నెలకొన్నదని, అందుకే ఇండియా కూటమిలో సీపీ ఐ భాగస్వామిగా ఉన్నదని చెప్పారు. భారతదేశాన్ని రక్షించేందుకే ‘దేశ్ బచావో.. బీజేపీ హఠావో’ అన్న నినాదాన్ని ఇండియా కూట మి ఇచ్చిందని తెలిపారు. సమావేశాలకు రా మకృష్ణ పాండా, కూనంనేని సాంబశివరావు, నిషా సిద్ధూ అధ్యక్షవర్గంగా వ్యవహరించారు.