హైదరాబాద్, ఏప్రిల్ 17 (నమస్తే తెలంగాణ): హిందుత్వ నినాదాన్ని బీజేపీ కేవలం రాజకీయ లబ్ధి కోసమే వాడుతున్నదని సీబీఐ మాజీ డైరెక్టర్ ఎం నాగేశ్వర్రావు ఆరోపించారు. సీఎం కేసీఆర్ ధార్మిక హిందువని, బీజేపీ నేతలు రాజకీయ హిందువులని ఆదివారం ట్వీట్ చేశారు. ‘శ్రీరామనవమి సందర్భంగా హైదరాబాద్లో నిర్వహించిన యాత్రల్లో దాదాపు 10 లక్షల మంది పాల్గొన్నారు. అయినా ఒక్క అవాంఛిత ఘటన కూడా జరుగలేదు. ఢిల్లీలో మాత్రం రాళ్లు విసిరారు. యాత్రపై దాడి జరిగింది. అక్కడ శాంతిభద్రతలు కేంద్ర హోంశాఖ చూసుకొంటుంది. ఎవరికి ఓటేయాలో ప్రజలు నిర్ణయించుకోవాలి. హిందువులు మరణించనంత కాలం.. మోదీకి ఓట్లు రాలవు’ అని ఓ నెటిజన్ ట్వీట్ చేయగా నాగేశ్వర్రావు బదులిచ్చారు. ‘కేసీఆర్కు హిందువులంటే మక్కువ. బీజేపీకి హిందూ శవాలంటే మహా ప్రీతి. కేసీఆర్ ధార్మిక హిందువైతే, బీజేపీ నేతలు రాజకీయ హిందువులు’ అని ట్వీట్ చేశారు.